రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్ షా

ABN, Publish Date - May 06 , 2024 | 10:14 AM

శ్రీ సత్యసాయి జిల్లా: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి జగన్మోహన్ రెడ్డి అవినీతే కారణమని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పేర్కొన్నారు. అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకే టీడీపీ, జనసేనతో బీజేపీ కూటమిగా ఏర్పడిందని అన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి జగన్మోహన్ రెడ్డి అవినీతే కారణమని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పేర్కొన్నారు. అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకే టీడీపీ, జనసేనతో బీజేపీ కూటమిగా ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై అమిత్ షా మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - May 06 , 2024 | 10:15 AM