Share News

రూ.150 కోసం యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:53 PM

రూ.150 కోసం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

రూ.150 కోసం యువకుడి ఆత్మహత్య

మూడుచింతలపల్లి, ఏప్రిల్‌ 8: రూ.150 కోసం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన దింటుసాహు(26) కుటుంబంతో కలిసి కొన్ని నెలల కిందట బతుకుదెరువు కోసం శామీర్‌పేట్‌ మండలం మజీద్‌పూర్‌కు వచ్చారు. గ్రామంలో నివాసముంటూ కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా దింటుసాహు మద్యానికిబానిసై తరచూ భార్య బిష్ణుసాహుతో గొడవ పడేవాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం దింటుసాహు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తనకు రూ.150ఇవ్వాలని భార్యతో గొడవ పడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. మద్యం మత్తులో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 08 , 2024 | 11:53 PM