ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 17 , 2024 | 11:58 PM
ఆర్థిక ఇబ్బందులతో క్రిమిసంహారక మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చౌడాపూర్ మండలం వీరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వీరాపూర్కు చెందిన యువకుడు రెబ్బనమోని శ్రీనివాస్(37) మద్యానికి బానిసయ్యాడు. దాంతో తెలిసిన వారి వద్ద అప్పు చేశాడు.
కులకచర్ల, ఏప్రిల్ 17: ఆర్థిక ఇబ్బందులతో క్రిమిసంహారక మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చౌడాపూర్ మండలం వీరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వీరాపూర్కు చెందిన యువకుడు రెబ్బనమోని శ్రీనివాస్(37) మద్యానికి బానిసయ్యాడు. దాంతో తెలిసిన వారి వద్ద అప్పు చేశాడు. మార్చి 14న సాయంత్రం అతని కుమారుడు రాజుకు ఫోన్చేసి అప్పులు అధికమయ్యాయని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతకగా రైతు బాలకిష్టయ్య పొలంలో గుర్తించి వెంటనే పాలమూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యశీలారెడ్డి తెలిపారు.