Share News

ఉరేసుకొని కార్మికుడి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:09 AM

మండలంలోని వీర్లపల్లి శివారులో గల జాగృతి పరిశ్రమ కార్మికుడు రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

ఉరేసుకొని కార్మికుడి ఆత్మహత్య

నందిగామ, ఏప్రిల్‌ 2 : మండలంలోని వీర్లపల్లి శివారులో గల జాగృతి పరిశ్రమ కార్మికుడు రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ర్టానికి చెందిన రమేష్‌ భుయాన్‌(25) 2 సంవత్సరాలుగా జాగృతి పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ పరిశ్రమకు సంబంధించిన రూమ్‌లో ఉంటున్నాడు. ఉన్నట్టుండి మంగళవారం తను ఉంటున్న రూమ్‌లో రమేష్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న సత్యేంద్ర భుయాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గోపాలక్రిష్ణ తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 12:09 AM