కారు ఢీకొని మహిళకు తీవ్రగాయాలు
ABN , Publish Date - May 26 , 2024 | 11:52 PM
వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పూడూరు మండల పరిధిలో చోటు చేసుకుంది.
పూడూరు, మే 26: వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పూడూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కాట్రవాత సునీత ఆదివారం రాకంచెర్ల గ్రామ సమీపంలో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో సునీత ఎడమ కాలు విరిగింది. కుటుంబసభ్యులు ఆమెను వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చన్గోముల్ ఎస్ఐ మధుసూదనరెడ్డి తెలిపారు.