Share News

ఘనంగా రాములోరి కల్యాణం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:03 AM

శ్రీరామ నవమి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీరామందిరంలోని పోస్టాఫీసు, బహార్‌పేట్‌ హనుమాన్‌ దేవాలయాల్లో అర్చకులు సీతారాముల కల్యాణం వేదమంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపించారు.

ఘనంగా రాములోరి కల్యాణం
యాలాల : జుంటుపల్లి రామస్వామిని దర్శించుకుంటున్న ఎంపీ రంజిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

పాల్గొన్న ఎంపీ రంజిత్‌రెడ్డి.. ప్రత్యేక పూజలు

పరిగి/యాలాల, ఏప్రిల్‌ 17: శ్రీరామ నవమి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీరామందిరంలోని పోస్టాఫీసు, బహార్‌పేట్‌ హనుమాన్‌ దేవాలయాల్లో అర్చకులు సీతారాముల కల్యాణం వేదమంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపించారు. పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిగిలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నధానం కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా యాలాల మండల పరిధిలోని జుంటుపల్లిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. వేద పండితులు, భాజాభజంత్రీల మధ్య కొనసాగిన కల్యాణ మహోత్సవం కనుల పండుగగా కొనసాగింది. కల్యాణ మహోత్సవంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి పాల్గొని ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

అమ్మపల్లిలో స్పీకర్‌, ఎంపీ ప్రత్యేక పూజలు

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17 : మండల పరిధిలోని నర్కూడ అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి గడ్డం రంజిత్‌రెడ్డి, తెలంగాణ డైరీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొర్ర జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గడ్డం శేఖర్‌యాదవ్‌ వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ యూత్‌ ప్రధాన కార్యదర్శి లలిత్‌ మర్రి, ప్రవీణ్‌రావు, మున్సిపల్‌ అధ్యక్షుడు సంజయ్‌ యాదవ్‌, గడ్డం విజయ, ఎంపీటీసీ గౌతమిఅశోక్‌, రవినాయక్‌, శ్రీధర్‌, శేఖర్‌యాదవ్‌, మల్లే్‌షయాదవ్‌, జగన్నాథం, అంజయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

షాబాద్‌ : మండలంలోని సీతారాంపూర్‌ రగ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన కల్యాణంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి సతీమణి, టీటీడీ మెంబర్‌ గడ్డం సీతారంజిత్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌, టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి పీసరి సురేందర్‌రెడ్డి, షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, మల్లేష్‌, ఆలయ ఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:04 AM