దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Feb 29 , 2024 | 12:07 AM
దశలవారీగా యాచారం బస్టాండ్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అన్ని రకాల వసతులు కల్పిస్తామని హయత్నగర్ డివిజనల్ మేనేజర్ ఎన్.సుచరిత అన్నారు.
యాచారం, ఫిబ్రవరి 28 : దశలవారీగా యాచారం బస్టాండ్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అన్ని రకాల వసతులు కల్పిస్తామని హయత్నగర్ డివిజనల్ మేనేజర్ ఎన్.సుచరిత అన్నారు. బుధవారం యాచారం బస్టాండ్ను సందర్శించి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా తాగునీటి సమస్యను తీర్చాలని డీఎం వెంకటనర్సప్పను ఆదేశించారు. రాత్రివేళ చీకటి ఉండడంతో విద్యుత్ వసతి కల్పించేందుకు అధికారులను ఆదేశించామన్నారు. బస్టాండ్లో ఉన్న రెండు షట్టర్లను అద్దెకిచ్చి సంస్థ ఆదాయం పెంపుకోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. తాగు నీటి ఎద్దడికి చర్యలు తీసుకుంటామని డీఎం చెప్పారు.