Share News

చేవెళ్ల గడ్డపై బీఎస్పీ జెండా ఎగరేస్తాం

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:01 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై బీఎస్పీ జెండా ఎగరేస్తామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయా ఆర్య తెలిపారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పలువురు ముఖ్య నాయకులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రకటన విడుదల చేశారు.

చేవెళ్ల గడ్డపై బీఎస్పీ జెండా ఎగరేస్తాం

చేవెళ్ల, మార్చి 7 : పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై బీఎస్పీ జెండా ఎగరేస్తామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయా ఆర్య తెలిపారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పలువురు ముఖ్య నాయకులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని బీఎస్పీ బలంగా ఉందన్నారు. పార్టీకి విస్తృత సేవలందిస్తున్న షాబాద్‌ మండలాధ్యక్షుడు మల్లి వెంకటేశ్‌ను చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే చేవెళ్ల మండలాధ్యక్షుడిగా కొనసాగుతున్న మొకరం కుమార్‌ను చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా చేవెళ్ల మండలాధ్యక్షుడిగా మొకరం రాజును నూతనంగా నియమించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గం ఇన్‌చార్జీలు రాజామహేంద్రవర్మ, జామ చంద్రం, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షుడు చందు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:01 AM