Share News

వంశీచంద్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలి

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:34 PM

కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ కేశంపేట మండలాధ్యక్షుడు గూడ వీరేష్‌ కోరారు.

వంశీచంద్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలి

కేశంపేట, మార్చి 9 : కాంగ్రెస్‌ మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ కేశంపేట మండలాధ్యక్షుడు గూడ వీరేష్‌ కోరారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి జాబితాలోనే కాంగ్రెస్‌ అధిష్ఠానం వంశీచంద్‌ రెడ్డికి ఎంపీ టికెట్‌ కేటాయించిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు నిరంతరం వంశీ గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు. సమావేశంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీశ్వరప్ప, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్‌, రావుల పెంటయ్య, గిరిధర్‌, కృష్ణ, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

చౌదరిగూడ : మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేయబోతున్న ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రాజు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. శనివారం పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని ప్రకటించడంతో పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీసెల్‌ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డి, నాయకులు ఏజా్‌సఅలీ, సలీం, అజ్జు, మక్సూద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:34 PM