లోకసభ ఎన్నికలు ముగిసే వరకూ.. ప్రజావాణి రద్దు
ABN , Publish Date - Mar 18 , 2024 | 12:21 AM
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు రద్దు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు.
![లోకసభ ఎన్నికలు ముగిసే వరకూ.. ప్రజావాణి రద్దు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు రద్దు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. వాస్తవానికి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్ గత ఫిబ్రవరి 26 నుంచే అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తాజాగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజావాణి తిరిగి కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.