Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

రైలుకింద పడి గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:17 AM

మండల పరిధిలోని తిమ్మాపూర్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రైలు కింద పడి 25సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ మల్లేశ్వర్‌ తెలిపారు.

రైలుకింద పడి గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య

కొత్తూర్‌, మార్చి 3 : మండల పరిధిలోని తిమ్మాపూర్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రైలు కింద పడి 25సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ మల్లేశ్వర్‌ తెలిపారు. ఆ యువకుడు రైలు పట్టాలపై తల పెట్టడంతో గుర్తుతెలియని రైలు మీదనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పారు. మృతుడు బీహార్‌కు చెందినవాడయి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తిమ్మాపూర్‌ రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ రాజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ మల్లేశ్వర్‌ చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9848090426 నెంబర్‌కు సమాచారం అందించాలని అన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:17 AM