బస్సు ఢీకొని గుర్తుతెలియని మహిళ దుర్మరణం
ABN , Publish Date - Jun 09 , 2024 | 11:24 PM
బస్సు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
![బస్సు ఢీకొని గుర్తుతెలియని మహిళ దుర్మరణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నందిగామ, జూన్ 9: మండల పరిధి ఎమ్ఎ్సఎన్ పరిశ్రమ సమీపంలోని బైపాస్ రోడ్డులో బస్సు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. బెంగళూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు నందిగా మ సమీపంలో బైపాస్ రోడ్డులో మహిళను ఢీకొంది. మహిళ మృతి చెందింది. మతదేహం గుర్తుపట్టలేని విధంగా ఛిత్రమైంది. ప్రమాదంపై వివరాలు తెలియాల్సి ఉందని ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మహిళ గ్రీన్ కలర్ జాకెట్, పసుపు రంగు చీర ధరించిందని, మృతురాలి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే నందిగామ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.