ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:39 AM
ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. శవంపై నీటిపై తేలియాడుతుండగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు.

ఇబ్రహీంపట్నం, జూలై 4: ఇబ్రహీంపట్నం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. శవంపై నీటిపై తేలియాడుతుండగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని బయటకుతీసి స్థానిక సీహెచ్సీ మార్చురీలో భద్రపరిచారు. కాగా, మృతుడి వయస్సు 55-60 సంవత్సరాలు ఉంటుందని, ఒంటిపై తెల్లచొక్కా, బూడిద రంగు ప్యాంటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుడి ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై మారయ్య తెలిపారు.