అనుమతి లేని రైస్ మిల్లు సీజ్
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:46 AM
అంతారంలో సర్వే నంబర్-101/2లో సంతో్షకుమార్గౌడ్ అనే వ్యక్తి పంచాయతీ అనుమతి లేకుండా రైస్మిల్లు నిర్మించాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ మిల్లును పంచాయతీ కార్యదర్శి ఇస్మాయిల్ మంగళవారం సీజ్ చేశారు.
![అనుమతి లేని రైస్ మిల్లు సీజ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తాండూరు రూర ల్, జనవరి 2: అంతారంలో సర్వే నంబర్-101/2లో సంతో్షకుమార్గౌడ్ అనే వ్యక్తి పంచాయతీ అనుమతి లేకుండా రైస్మిల్లు నిర్మించాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ మిల్లును పంచాయతీ కార్యదర్శి ఇస్మాయిల్ మంగళవారం సీజ్ చేశారు. అంతారంలో అక్రమంగా రైస్మిల్లు నిర్మించారు. అనుమతి తీసుకోవాలని సంతో్షకుమార్గౌడ్కు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. అక్రమ నిర్మాణం చేపట్టినందుకు గాను రైస్ మిల్లు వద్ద నోటీసు అతికించి సీజ్ చేసినట్లు కార్యదర్శి తెలిపారు. వారం రోజుల్లో అక్రమ నిర్మాణాన్ని తొలగించకుంటే పంచాయతీ ఆధ్వర్యంలో కూల్చివేస్తామని నోటీసులో పేర్కొన్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు.