రెండు కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:08 AM
గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఓవ్యక్తిని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.

ఘట్కేసర్ రూరల్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఓవ్యక్తిని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. ఎక్సైజ్ సీఐ రవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూపీకి చెందిన చందన(37) నగరంలోని నేరేడ్మెట్లో నివాసముంటున్నాడు. సోమవారం చర్లపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న యాక్టీవాను ఆపి తనిఖీ చేయగా అందులో రెండు కిలోల గంజాయి లభించింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చందన సొంతరాష్ట్రం వెళ్లి వచ్చినప్పుడల్లా గంజాయి తీసుకొచ్చి కాప్రా మండల పరిధిలో విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు గంజాయితో పాటు యాక్టీవాను స్వాధీనం చేసుకొని సాయంత్రం రిమాండ్కు తరలిచినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు.