రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Jan 28 , 2024 | 11:56 PM
మండల కేంద్రానికి సమీపంలో గల వైజంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్లు ఎస్సై జి.శ్రీనివాస్ తెలిపారు.
![రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కొత్తూర్, జనవరి 28: మండల కేంద్రానికి సమీపంలో గల వైజంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్లు ఎస్సై జి.శ్రీనివాస్ తెలిపారు. మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ గ్రామానికి చెందిన శంకరయ్య, బాలయ్యలు బైక్పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు గాయపడినట్లు తెలిపారు. ఈమేరకు క్షతగాత్రులను శంషాబాద్లోని ఓ ప్రైవేట్ అసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.