నేడు ముచ్చింతల్కు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ABN , Publish Date - Apr 08 , 2024 | 11:55 PM
శంషాబాద్ మండల పరిధి ముచ్చింతల్లో గల స్వర్ణభారత్ ట్రస్ట్లో మంగళవారం జరిగే ఉగాది ఉత్సవాల్లో
![నేడు ముచ్చింతల్కు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఉగాది ఉత్సవాల్లో పాల్గొననున్న గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 8 : శంషాబాద్ మండల పరిధి ముచ్చింతల్లో గల స్వర్ణభారత్ ట్రస్ట్లో మంగళవారం జరిగే ఉగాది ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని ట్రస్ట్ సభ్యులు సోమవారం పేర్కొన్నారు. నేటి ఉదయం 8గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే ట్రస్ట్లో శిక్షణ తీసుకున్న విద్యార్థులకు సర్టిపికెట్ల పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.