అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:47 PM
అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను పోచారం ఐటీసీ పోలీసులు సీజ్ చేశారు. సీఐ అశోక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
![అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు సీజ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఘట్కేసర్ రూరల్, జనవరి 12: అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను పోచారం ఐటీసీ పోలీసులు సీజ్ చేశారు. సీఐ అశోక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం పోలీస్ స్టేషన్ పరిధి జోడిమెట్ల సమీపంలో మట్టిని టిప్పర్లలో అక్రమంగా రవాణ చేస్తున్నారని రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్లపై, రెండు టిప్పర్లను సీజ్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.