వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
ABN , Publish Date - May 31 , 2024 | 12:10 AM
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి చెందిన సంఘటన షాద్నగర్ పోలీస్ స్టేసన్ పరిధిలోని కందివనం గ్రామంలో జరిగింది. ఇన్స్పెక్టర్ ప్రతా్పలింగం కథనం ప్రకారం.. కందివనం గ్రామానికి చెందిన మానస(19) పట్టణంలోని ఓ కళాశాలలో ఈ ఏడాది డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసింది.
![వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి](https://media.andhrajyothy.com/media/2024/20240530/66_8ec15fc485.jpg)
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని దుర్మరణం
షాద్నగర్ రూరల్, మే 30: అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి చెందిన సంఘటన షాద్నగర్ పోలీస్ స్టేసన్ పరిధిలోని కందివనం గ్రామంలో జరిగింది. ఇన్స్పెక్టర్ ప్రతా్పలింగం కథనం ప్రకారం.. కందివనం గ్రామానికి చెందిన మానస(19) పట్టణంలోని ఓ కళాశాలలో ఈ ఏడాది డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసింది. బుధవారం బంధువులు ఒకరు చనిపోవడంతో తల్లిదండ్రులు వేరే గ్రామానికి అంత్యక్రియలకు వెళ్లారు. ఈక్రమంలో సాయంత్రం మాసన ఇంట్లో ఉరేసుకుని మృతి చెంది ఉండటం గమనించిన గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి చుట్టుపక్కల వాళ్లకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అయితే, రాములుకు సంతానం లేకపోవడంతో మానసను రెండో పెళ్లి చేసుకుంటానని కొంత కాలంగా వెంట పడుతున్నట్లు తెలిసింది. మృతురాలి తల్లి లక్ష్మమ్మ కూడా రాములుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మృత దేహాన్ని ఉస్మానియాకు పంపించి దర్యాప్పు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్టీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొకరు..
శంషాబాద్ రూరల్, మే 30 : అనుమానాస్పద స్దితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఇందర్చెడ్ గ్రామానికి చెందిన మండిగ శివకుమార్(35), లలిత భార్యభర్తలు. మూడు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం శంషాబాద్కు వచ్చిన హుడా కాలనీలో అద్దెకు నివాసం ఉంటున్నారు. గురువారం పనికి వెళ్తున్నానని చెప్పి భార్య లలిత వద్ద రూ.1,500 తీసుకుని శివకుమార్ బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం కాలనీలో ఉన్న ఒక వ్యక్తి వచ్చిన శివకుమార్ సిద్దులుగుట్టకు వెళ్లేదారితో ఉన్న ఎస్ఆర్కే స్విమ్మింగ్ పూల్లో పడి మృతిచెందినట్లు చెప్పాడు. భార్య సంఘటన స్థలానికి వెళ్లి చూడగా.. అప్పటికే మృతిచెంది ఉన్నాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతుడు మద్యం సేవించి స్విమ్మింగ్ చేయడానికి వెళ్లి మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు.
చికిత్స పొందుతూ యువకుడు..
షాద్నగర్ రూరల్, మే 30: ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఏఎస్సై రాంచంద్రయ్య తెలిపారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలికట్ట గ్రామానికి చెందిన బత్తుల రమేష్(25) అనారోగ్యంతో ఈ నెల 26న గుళికల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అదేరోజు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందినట్లు తెలిపారు.