గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్
ABN , Publish Date - Jan 07 , 2024 | 11:55 PM
నూతన్కల్ గ్రామంలో గంజాయి విక్కయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు పట్టుకుని మేడ్చల్ పోలీసులకు అప్పగించారు.
![గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మేడ్చల్ టౌన్, జనవరి 7: నూతన్కల్ గ్రామంలో గంజాయి విక్కయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు పట్టుకుని మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతన్కల్ గ్రామానికి చెందిన జలాలుద్దీన్, గోపాల్సింగ్, భాగ్యశ్రీ వికా్సబార్డే, ప్రసాద్ అనే నలుగురు కొంత కాలంగా గ్రామ పరిధిలో గంజాయి విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆదివారం వారి స్థావరాలపై దాడులు నిర్వహించారు. అక్కడ నలుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి 3కిలో 115గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.