Share News

ముమ్మరంగా వాహనాల తనిఖీ

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:41 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కడ్తాల్‌లో పోలీసులు వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. గురువారం కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కారును ఆపి తనిఖీ చేశారు.

ముమ్మరంగా వాహనాల తనిఖీ

కడ్తాల్‌, ఏప్రిల్‌ 25 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కడ్తాల్‌లో పోలీసులు వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. గురువారం కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కారును ఆపి తనిఖీ చేశారు. రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివా్‌సరెడ్డి వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. సీఐ శివప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా పక్కాగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. తనిఖీలో ఎన్నికల టీం సభ్యుడు కసిరెడ్డి వినయ్‌, సమీర్‌, ఏఎస్సై బాల్‌రెడ్డి, కృష్ణయ్య, పీసీ మంజు తదితరులున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:41 PM