Share News

ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:54 PM

ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు.

ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా
మాట్లాడుతున్న మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి

శామీర్‌పేట, జనవరి 30: ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు. శామీర్‌పేట్‌ మండలంలోని అలియాబాద్‌ క్రాస్‌రోడ్డులోని సీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డితో కలిసి విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ, మున్సిపాలిటీల్లోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసామన్నారు. జవహర్‌నగర్‌లోనే 40వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగేహక్కు మనకే ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. పదవీ కాలం ముగియనుండటంతో వివిధ గ్రామాల సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ఎల్లుబాయి, హారికమురళిగౌడ్‌, జడ్పీటీసీ అనిత లాలయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్‌, మల్లే్‌షగౌడ్‌, పార్టీ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:54 PM