Share News

ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు చోరీ

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:50 PM

ఓ హాస్టల్‌లోకి గుర్తుతెలియని దుండగులు 6 ల్యాప్‌ టాప్‌లు, 2 సెల్‌ఫోన్లను అపహరించుకెళ్లిన సంఘటన పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం పోచారం మున్సిపల్‌, యంనంపేట్‌లోని అలేఖ్య బాలుర హాస్టల్‌లో స్థానిక శ్రీనిధి కళాశాలకు చెందిన హరీ్‌షరెడ్డి, సాయికిరణ్‌, రవీంద్రనాయక్‌, విష్ణువర్దన్‌, ఇన్ఫోసిస్‌ ఉద్యోగి మారుతీ ఉంటున్నారు.

ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు చోరీ

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌3 : ఓ హాస్టల్‌లోకి గుర్తుతెలియని దుండగులు 6 ల్యాప్‌ టాప్‌లు, 2 సెల్‌ఫోన్లను అపహరించుకెళ్లిన సంఘటన పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం పోచారం మున్సిపల్‌, యంనంపేట్‌లోని అలేఖ్య బాలుర హాస్టల్‌లో స్థానిక శ్రీనిధి కళాశాలకు చెందిన హరీ్‌షరెడ్డి, సాయికిరణ్‌, రవీంద్రనాయక్‌, విష్ణువర్దన్‌, ఇన్ఫోసిస్‌ ఉద్యోగి మారుతీ ఉంటున్నారు. గతనెల 30న రాత్రి 11 గంటల సమయంలో చదువుకున్న తరువాత ల్యాప్‌ టాప్‌లు, సెఫ్‌ఫోన్లను సెల్ఫ్‌లో పెట్టి తలుపులు వేసి పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి 6 ల్యాప్‌టా్‌పలు, 2 సెల్‌ఫోన్లు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వేతికి, తెలిసిన వారిని విచారించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jun 03 , 2024 | 11:50 PM