Share News

మైసమ్మ ఆలయంలో చోరీ

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:53 PM

మండల పరిధిలోని బహదూర్‌గూడలోని మైసమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వెండి వస్తువులను దొంగిలించారు.

మైసమ్మ ఆలయంలో చోరీ

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 3 : మండల పరిధిలోని బహదూర్‌గూడలోని మైసమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వెండి వస్తువులను దొంగిలించారు. బుధవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బహదూర్‌గూడకు చెందిన ఏనుగు బుచ్చిరెడ్డి తన పొలంలో మైసమ్మ గుడిని కట్టించుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలో అమ్మవారి 2 గ్రాము ముక్కుపుడక, 20 తులాల వెండి తొడుగు అపహరించారు. బుచ్చిరెడ్డి శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటన స్ధలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 11:53 PM