కేబుల్ గోదాంలో చోరీ
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:49 PM
ఓ కేబుల్ గోదాంలో చోరీ జరిగిన ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
![కేబుల్ గోదాంలో చోరీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఘట్కేసర్ రూరల్, మార్చి 22: ఓ కేబుల్ గోదాంలో చోరీ జరిగిన ఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడిషనల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం, అవుషాపూర్లోని ఓ కేబుల్ గోదాంలో గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి రూ.7.5లక్షలు విలువచేసే నాలుగు కేబుల్ వైర్లను అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న గోదాం ఇన్చార్జి నరేందర్సింగ్ అక్కడికి చేరుకుని వాచ్మన్ను ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాఽధితుడి పిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకొని కేబుల్ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ సీఐ తెలిపారు.