శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో చోరీ
ABN , Publish Date - Mar 24 , 2024 | 12:04 AM
ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధి పోచారం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి స్వామివారి రెండు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు.
ఇబ్రహీంపట్నం, మార్చి 23 : ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధి పోచారం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి స్వామివారి రెండు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. వీటి విలువ రూ.లక్ష ఉంటుంది. దుండగులు ఆలయానికి ఉన్న తాళం తొలగించి చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఏసీపీ కేపీవీ రాజు ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.