వ్యక్తిని ఢీకొన్న ట్రాక్టర్.. తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jan 09 , 2024 | 11:25 PM
ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి చేయి విరిగింది. మండలంలోని మాల్కు చెందిన పెంటయ్య లూనా(ద్విచక్రవాహనం)పై సోమవారం సాయంత్రం పొలం వద్దకు వెళుతున్నాడు.
![వ్యక్తిని ఢీకొన్న ట్రాక్టర్.. తీవ్ర గాయాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
యాచారం, జనవరి 9 : ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి చేయి విరిగింది. మండలంలోని మాల్కు చెందిన పెంటయ్య లూనా(ద్విచక్రవాహనం)పై సోమవారం సాయంత్రం పొలం వద్దకు వెళుతున్నాడు. ఈక్రమంలో వెనకాల నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో లూనాపై నుంచి పెంటయ్య కిందపడ్డాడు. దాంతో అతడి చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబికులు నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.