గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
ABN , Publish Date - Apr 17 , 2024 | 11:58 PM
మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో ఓ గర్తు తెలియన మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబీల్పూర్ శివార్లలోని ఓ వెంచర్లో స్థానికులకు బుధవారం కుళ్లిపోయిన మహిళ మృతదేహం కనబడటంతో పోలీసులకు సమాచారమిచ్చారు.
మేడ్చల్ టౌన్, ఏప్రిల్ 17 : మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో ఓ గర్తు తెలియన మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబీల్పూర్ శివార్లలోని ఓ వెంచర్లో స్థానికులకు బుధవారం కుళ్లిపోయిన మహిళ మృతదేహం కనబడటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా మహిళ శరీరం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టని విధంగా ఉంది. మృతురాలి వయసు సుమారు 40-45 మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.