Share News

ఎదురెదురుగా బైక్‌లు ఢీ

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:53 PM

ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొన్న ఘటన ఆదివారం కొడంగల్‌ మండలంలోని ఉడిమేశ్వరం గేటు సమీపంలో చోటుచేసుకుంది.

ఎదురెదురుగా బైక్‌లు ఢీ
ప్రమాదంలో గాయాలపాలైన వాహనదారులు

  • ఒకరి పరిస్థితి విషమం.. మరో నలుగురికి గాయాలు

కొడంగల్‌ రూరల్‌, జనవరి 7: ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొన్న ఘటన ఆదివారం కొడంగల్‌ మండలంలోని ఉడిమేశ్వరం గేటు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొడంగల్‌ మండలంలోని కస్తూర్‌పల్లి గ్రామానికి చెందిన హాజమొద్దీన్‌ బైక్‌పై ప్యాలమద్ది గ్రామానికి చెందిన సలీమా(అత్త)తో కలిసి తాండూర్‌ వెళ్లి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో చిలుముల్‌మైలారం గ్రామం నుంచి చెంగోల్‌కు బైక్‌పై అనంతయ్య, రాయప్ప, అశోక్‌లు బయల్దేరారు. వీరి బైక్‌లు ఉడిమేశ్వరం గేటు సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హాజీమొద్దీన్‌ కుడికాలు విరిగింది. తలకు బలమైన గాయమైంది. మిగతా నలుగురికి గాయాలు కావడంతో గమనించిన వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించి కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో హాజీమొద్దీన్‌ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 11:53 PM