Share News

జాతీయస్థాయి కరాటే పోటీల్లో తాండూరు విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:05 AM

షాద్‌నగర్‌లో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో తాండూరు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

జాతీయస్థాయి కరాటే  పోటీల్లో తాండూరు విద్యార్థుల ప్రతిభ
మెడల్స్‌ సాధించిన తాండూరుకు చెందిన విద్యార్థులు

తాండూరు, జనవరి 8: షాద్‌నగర్‌లో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో తాండూరు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఓపెన్‌ చాంపియన్‌షి్‌పలో సీనియర్‌ మాస్టర్‌ మోహన్‌ కృష్ణ బృందం తాండూరు నుంచి పోటీల్లో పాల్గొన్నారు. బ్లాక్‌ బెల్ట్‌ విద్యార్థులు హర్షిత్‌, మణికంఠ, హన్సికలు గ్రాండ్‌ చాంపియన్‌ కప్‌లను సాధించారు. నందకిషోర్‌, రేవంత్‌, పల్లవి, మణికంఠ, బంగారు పతకాలను, రాకేష్‌, ఆకాష్‌, ప్రవీణ్‌కుమార్‌, శివకుమార్‌, అనుదీ్‌పరెడ్డి వెండి పతకాలు సాధించారు.

Updated Date - Jan 09 , 2024 | 12:05 AM