Share News

ఎన్నికల్లో మద్దతివ్వండి: ఈటల

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:04 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కోరారు.

ఎన్నికల్లో మద్దతివ్వండి: ఈటల
మేడ్చల్‌లో ప్రముఖులను కలిసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

మేడ్చల్‌ టౌన్‌, మార్చి 21: పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కోరారు. మేడ్చల్‌ పట్టణంలోని పలువురు నేతల ఇంటికి ఆయన గురువారం వెళ్లి కలిశారు. మేడ్చల్‌ మాజీ సర్పంచ్‌ చీదు దేవంద్‌రెడ్డి, మురళీధర్‌గుప్త, మేడ్చల్‌ పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌ నివాసానికి వెళ్లి ఈటల కలిశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి ప్రతీఒక్కరు మద్దతు పలకాలన్నారు. ఈనెల 23న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున తమ పార్టీలో చేరుతున్నారని కావున మేడ్చల్‌ పట్టణ నేతలూ పార్టీలోచేరి తమకు మద్దతివ్వాలని కోరారు. కాగా మాజీ సర్పంచ్‌ మురళీధర్‌ గుప్త ఈటలకు మద్దతివ్వడానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారెడ్డి నందారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:04 AM