నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:40 PM
నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మినా.. లూజుగా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ గీతారెడ్డి చెప్పారు.

జిల్లాలో ఎరువులు విత్తనాల కొరత లేదు
వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ గీతా రెడ్డి
యాచారం, జూన్ 7 : నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మినా.. లూజుగా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ గీతారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆమె యాచారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎ రువులు విత్తనాలు లూజుగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విత్తనాలు కొన్న రైతులు రసీదులు తీసుకోవాలని, వాటిని పంట చేతికందే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ అనుమతి లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎ రువులను కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలం చెల్లిన విత్తనాలు అమ్మరాదని కోరారు. పదిమందికి అన్నం పెడుతున్న రైతుకు అన్యాయం చేయరాదని వ్యాపారులకు సూచించారు. ఖరీఫ్ సీజన్ ముగిసేదాకా ప్రతీ మండలంలోని ఎ రువులు, విత్తనాల దుకాణాలను వ్యవసాయాధికారులు తనిఖీ చేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.