హత్యా ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:15 AM
మండలంలోని పులుమద్ది గ్రామశివారులో గుర్తు తెలియని మహిళను హత్య చేసి, మృతదేహానికి నిప్పటించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.
![హత్యా ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ](https://media.andhrajyothy.com/media/2023/20231205/16_VKB_109_A_003807672c.jpg)
వికారాబాద్, జనవరి 16: మండలంలోని పులుమద్ది గ్రామశివారులో గుర్తు తెలియని మహిళను హత్య చేసి, మృతదేహానికి నిప్పటించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనాస్థలాన్ని, ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. టెక్నికల్, సీసీఎస్, ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, ఇతర సమాచారం ఆధారంగా మృతురాలిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబందించి వివరాలు తెలిసిన వారు సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు.