Share News

టీఎ్‌సఐఐసీ భూముల్లో సాయిల్‌ టెస్ట్‌

ABN , Publish Date - Jun 29 , 2024 | 11:48 PM

కుర్మిద్దలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో మట్టి పరీక్షల(సాయిల్‌ టెస్ట్‌)కు యత్నించిన టీఎ్‌సఐఐసీ అధికారులను రైతులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.

టీఎ్‌సఐఐసీ భూముల్లో సాయిల్‌ టెస్ట్‌
యంత్రాలు బిగిస్తున్న టీఎ్‌సఐఐసీ అధికారులు

యంత్రాల బిగింపు

అడ్డుకున్న రైతులు

యాచారం, జూన్‌ 29 : కుర్మిద్దలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో మట్టి పరీక్షల(సాయిల్‌ టెస్ట్‌)కు యత్నించిన టీఎ్‌సఐఐసీ అధికారులను రైతులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. టీఎ్‌సఐఐసీ అధికారులు శనివారం ఫార్మాసిటీ భూముల్లో బండరాళ్లున్నాయి? నేల స్వభావంపై పరీక్షలు చేసేందుకు డ్రిల్‌ యంత్రాలను బిగించే ందుకు సిద్ధమయ్యారు. ఈ భూముల్లో పనులు చేయొద్దని రైతులు అడ్డుకున్నారు. జిల్లా టీఎ్‌సఐఐసీ డీఈ పవార్‌కు తెలియడంతో గ్రామానికి చే రుకొని రైతులను సముదాయించడానికి య త్ని ంచారు. మట్టి పరీక్షలపై రైతులు కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డికి ఫోన్‌లో తెలుపగా.. ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎలాంటి పరీక్షలు చేయకుండా పనులు నిలిపివేయాలని టీఎ్‌సఐఐసీ అధికారులను ఆదేశించడంతో వరు వెళ్లిపోయారు.

Updated Date - Jun 29 , 2024 | 11:48 PM