జోనల్ స్థాయి క్రీడాకారుల ఎంపిక
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:11 AM
బషీరాబాద్లోని జడ్పీ పాఠశాల మైదానంలో ఎస్జీఎ్ఫ(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో జోనల్స్థాయి క్రీడల ఎంపిక పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
బషీరాబాద్, సెప్టెంబర్ 20: బషీరాబాద్లోని జడ్పీ పాఠశాల మైదానంలో ఎస్జీఎ్ఫ(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో జోనల్స్థాయి క్రీడల ఎంపిక పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎంఈవో సుధాకర్రెడ్డి పోటీలను ప్రారంభించారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ ఎంపికలో మొదటి రోజు అండర్-14 బాలబాలికలకు ఖోఖో పోటీలను నిర్వహించారు. అండర్-14, 17వాలీబాల్, కబడ్డీ, వివిధ విభాగాల్లో పరుగు పందెం, షాట్పుట్, జావెలిన్ త్రో, డిస్కైస్ త్రో, లాంగ్జంప్, హైజంప్ అంశాల్లో సెలెక్షన్లు జరుగనున్నాయి. ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ చూపిన వారిని జోనల్స్థాయికి ఎంపిక చేస్తామని ఎస్జీఎఫ్ జోనల్ సెక్రెటరీ జె.అంబదాస్ తెలిపారు. కార్యక్రమంలో పీడీలు భాస్కర్, గంగయ్య, రాజశేఖర్, బుగ్గప్ప, జ్యోతి పాల్గొన్నారు.