Share News

మతతత్వ విధానాలను ప్రతిఘటించాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:22 AM

మతతత్వ విధానాలను దేశ ప్రజలు ప్రతిఘటించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాద్యక్షుడు బి. దత్తునాయక్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మంఖాల్‌ పారిశ్రామిక వాడలో కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న మతతత్వ విధానాలకు సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు.

మతతత్వ విధానాలను ప్రతిఘటించాలి

ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్తునాయక్‌

మహేశ్వరం, ఫిబ్రవరి 14 : మతతత్వ విధానాలను దేశ ప్రజలు ప్రతిఘటించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాద్యక్షుడు బి. దత్తునాయక్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మంఖాల్‌ పారిశ్రామిక వాడలో కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న మతతత్వ విధానాలకు సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు, ఏకమై కార్పోరేట్‌ మతతత్వ విధానాలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఫిబ్రవరి 16 న సమ్మె చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతూ పేదల సమస్యలను గాలికొదిలేశారని మండి పడ్డారు. రాబోయే పార్టమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేవెందర్‌, యాదగిరి, బహ్మచారి, భారతి, కల్పన, నరసింహ, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:22 AM