మతతత్వ విధానాలను ప్రతిఘటించాలి
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:22 AM
మతతత్వ విధానాలను దేశ ప్రజలు ప్రతిఘటించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాద్యక్షుడు బి. దత్తునాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మంఖాల్ పారిశ్రామిక వాడలో కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న మతతత్వ విధానాలకు సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు.
![మతతత్వ విధానాలను ప్రతిఘటించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్తునాయక్
మహేశ్వరం, ఫిబ్రవరి 14 : మతతత్వ విధానాలను దేశ ప్రజలు ప్రతిఘటించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాద్యక్షుడు బి. దత్తునాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మంఖాల్ పారిశ్రామిక వాడలో కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న మతతత్వ విధానాలకు సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు, ఏకమై కార్పోరేట్ మతతత్వ విధానాలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఫిబ్రవరి 16 న సమ్మె చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచి పెడుతూ పేదల సమస్యలను గాలికొదిలేశారని మండి పడ్డారు. రాబోయే పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేవెందర్, యాదగిరి, బహ్మచారి, భారతి, కల్పన, నరసింహ, వెంకటేష్ పాల్గొన్నారు.