బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Feb 12 , 2024 | 12:00 AM
ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో బైక్పై వెళుతున్న ఆమనగల్లు మండలం వేములకుంట తండాకు చెందిన చంద్రు, బుజ్జిలు తీవ్రంగా గాయపడ్డారు.
![బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆమనగల్లు, ఫిబ్రవరి 11 : ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో బైక్పై వెళుతున్న ఆమనగల్లు మండలం వేములకుంట తండాకు చెందిన చంద్రు, బుజ్జిలు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వైపు నుంచి బైక్పై వచ్చి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.