Share News

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీ

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:00 AM

చోరీకి గురైన సెల్‌ఫోన్‌లను సీఈఐఆర్‌ యాప్‌ సాయంతో రికవరీ చేసినట్లు ఎస్‌ఐ రవిగౌడ్‌ తెలిపారు. మండలంలోని బాసుపల్లి గ్రామానికి చెందిన కుందెల రామకృష్ణ గత సంవత్సరం అక్టోబర్‌ 25వ తేదీన గ్రామంలో దుర్గామాత నిమజ్జన వేడుకల్లో పాల్గొనగా గుర్తుతెలియని వ్యక్తి అతడి సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు.

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీ

దోమ/నవాబుపేట, జనవరి 8: చోరీకి గురైన సెల్‌ఫోన్‌లను సీఈఐఆర్‌ యాప్‌ సాయంతో రికవరీ చేసినట్లు ఎస్‌ఐ రవిగౌడ్‌ తెలిపారు. మండలంలోని బాసుపల్లి గ్రామానికి చెందిన కుందెల రామకృష్ణ గత సంవత్సరం అక్టోబర్‌ 25వ తేదీన గ్రామంలో దుర్గామాత నిమజ్జన వేడుకల్లో పాల్గొనగా గుర్తుతెలియని వ్యక్తి అతడి సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. దీంతో బాధితుడు దోమ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు సీఈఐఆర్‌ యాప్‌ సాయంతో ట్రేస్‌ చేసి ఆ సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న వ్యక్తిని గుర్తించారు. సోమవారం బాధితుడు రామకృష్ణకు ఎస్‌ఐ రవిగౌడ్‌ ఫోన్‌ను అందజేశారు. అదేవిధంగా నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాలకు ఐదుగురికి సీఈఐఆర్‌ యాప్‌ సాయంతో ట్రేస్‌ చేసి పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను రికవరీ చేసి సోమవారం ఎస్‌ఐ భరత్‌ భూషన్‌ నవాబుపేట పోలీ్‌సస్టేషన్‌లో అందజేశారు.

Updated Date - Jan 09 , 2024 | 12:00 AM