Share News

25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:00 AM

అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి, బియ్యంను స్వాధీనం చేసుకున్న ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 17 : అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి, బియ్యంను స్వాధీనం చేసుకున్న ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, మార్కాపురంనకు చెందిన భూక్య రాజేందర్‌ ఘట్‌కేసర్‌ పరిసర ప్రాంతంలో తక్కువ ధరకు రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తుంటాడు. ఆ బియ్యాన్ని ఇటుక బట్టీలు, కోళ్ళ ఫారాలలో పనిచేసే కూలీలకు ఎక్కువ ధరకు విక్రయిస్తుంటాడు. బుధవారం ఘట్‌కేసర్‌ మున్సిపల్‌, శివారెడ్డిగూడ వద్ద 25 క్వింటాళ్ళ రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అశోక్‌ లేల్యాండ్‌ వాహనంలో తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రాజేందర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 07:56 AM