దంపతుల మధ్య గొడవ.. భర్త బలవన్మరణం
ABN , Publish Date - Apr 27 , 2024 | 11:31 PM
భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం కీసర పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
![దంపతుల మధ్య గొడవ.. భర్త బలవన్మరణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కీసర రూరల్, ఏప్రిల్ 27: భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం కీసర పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేష్(38) అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 12 సంవత్సరాల కిందట కీసర మండల కేంద్రానికి చెందిన భవానితో వివాహమైంది. తొమ్మిదేళ్ల కూతురు, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామంలో వారికి చెందిన పొలం విక్రయించగా వచ్చిన డబ్బులతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన లావాదేవీలను భవాని చూసుకుంటోంది. ఇదిలా ఉండగా భవాని తన ఫోన్ ద్వారా ఓవ్యక్తికి ఫోన్పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేష్ తన భార్య భవానిని నిలదీసాడు. ఈ తంతు కొంతకాలంగా కొనసాగుతోంది. కాగా శుక్రవారం భార్యతో గొడవ పడటంతో ఆమె కీసర గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేష్ కీసరలోని అత్తగారింటికి వచ్చి వారితో గొడవకు దిగాడు. అత్తింటివారు మహే్షకు సర్దిచెప్పి ఇంటికి వెళ్లమని చెప్పారు. అక్కడి నుంచి మహేష్ చీర్యాల గ్రామంలోని బంధువులకు చెందిన వ్యవసాయ పొలం వద్దకు చేరుకున్నాడు. రాత్రి 10గంటల సమయంలో అతడి బావమరిదికి వీడియోకాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే సరికే మహేష్ ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న అస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మహేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.