మాజీ ఎమ్మెల్యే ఫాంహౌ్సలో పేకాట.. పోలీసుల దాడి
ABN , Publish Date - Feb 28 , 2024 | 11:50 PM
మాజీ ఎమ్మెల్యే ఫాంహౌ్సలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి పది మందిపై కేసు నమోదు చేసినట్లు చెన్గోముల్ ఎస్ఐ మధుసూదనరెడ్డి తెలిపారు.
![మాజీ ఎమ్మెల్యే ఫాంహౌ్సలో పేకాట.. పోలీసుల దాడి](https://media.andhrajyothy.com/media/2024/20240227/qq_1f758e2fd5.jpg)
పూడూరు, ఫిబ్రవరి 28: మాజీ ఎమ్మెల్యే ఫాంహౌ్సలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి పది మందిపై కేసు నమోదు చేసినట్లు చెన్గోముల్ ఎస్ఐ మధుసూదనరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా మేరకు బుధవారం పూడూరు సమీపంలో గల ఫాంహౌ్సలో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని రూ.50,990, పది సెల్ఫోన్లు, 3 కార్లు, 3 బైక్లను స్వాఽధీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.