Share News

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:58 PM

షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో ఉన్న నీటిగుంటలో పడి వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

షాద్‌నగర్‌ రూరల్‌, జనవరి 28: షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో ఉన్న నీటిగుంటలో పడి వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఎస్సై దేవకి కథనం ప్రకారం.. షాద్‌నగర్‌ పటేల్‌ రోడ్డుకు చెందిన రాసాల శివకుమార్‌(31) పెయింటర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడికి ఒక కూతురు ఉంది. ఏడేళ్ల క్రితం భార్య విడిచిపెట్టి వెళ్లిపోగా తల్లితో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి లింగారెడ్డి గూడ శివారులో నీటిగుంటలో పడి మృతిచెంది కనిపించాడు. గ్రామస్తుల సమాచారంతో తల్లి అక్కడికి చేరుకుని బోరున విలపించింది. మృతహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Jan 29 , 2024 | 07:22 AM