వాటర్మ్యాన్పై వ్యక్తి దాడి
ABN , Publish Date - Apr 27 , 2024 | 11:33 PM
వాటర్మ్యాన్పై ఓవ్యక్తి దాడి చేసినట్లు గ్రామ కార్యదర్శి దేవేందర్ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![వాటర్మ్యాన్పై వ్యక్తి దాడి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బషీరాబాద్, ఏప్రిల్ 27: వాటర్మ్యాన్పై ఓవ్యక్తి దాడి చేసినట్లు గ్రామ కార్యదర్శి దేవేందర్ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని మంతన్గౌడ్ గ్రామం ఎస్సీ కాలనీలో డైరెక్టు పంపింగ్ సిస్టం బోరు ఒకటి మరమ్మత్తుకు గురైంది. దీంతో స్థానిక కార్యదర్శి ఎస్సీ కాలనీలోని మరోబోరు ద్వారా నీటి కొరత రాకుండా ట్యాంకర్ను పెట్టి నీటిని సరఫరా చేయిస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం స్థానికుడు హన్మంతు బోరును ఇంకెప్పుడూ మరమ్మతు చేయిస్తారంటూ అక్కడున్న వాటర్మ్యాన్ను ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవకు దారితీసినట్లు కార్యదర్శి చెబుతున్నారు. ఈ గొడవలో హన్మంతు తనపై దాడి చేశాడని వాటర్మ్యాన్ తనకు ఫోన్చేసినట్లు కార్యదర్శి వివరించారు. శనివారం ఈ విషయమై గ్రామ కార్యదర్శి ఎంపీవో రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు.