Share News

గుర్రంపీర్‌ జాతరకు పోటెత్తిన జనం

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:09 PM

గుర్రంపల్లి గుర్రంపీర్‌ ఉర్సు ఉత్సవాలు వైభవంగా కొనసాగున్నాయి. జాతర మూడో రోజు ఆదివారం కందూరు కార్యక్రమాల్లో భాగంగా భక్తులు గుర్రంపీర్‌కు మొక్కులు చెల్లించుకున్నారు.

గుర్రంపీర్‌ జాతరకు పోటెత్తిన జనం
గుర్రంపీర్‌కు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

చౌదరిగూడ, జనవరి 28: గుర్రంపల్లి గుర్రంపీర్‌ ఉర్సు ఉత్సవాలు వైభవంగా కొనసాగున్నాయి. జాతర మూడో రోజు ఆదివారం కందూరు కార్యక్రమాల్లో భాగంగా భక్తులు గుర్రంపీర్‌కు మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ గ్రామాల నుంచి వేలాది మంది గుర్రంపీర్‌ జాతరకు తరలివచ్చారు. జాతరలో ఏర్పాటు చేసిన మిఠాయి, జిలేబీ, గాజులు తదితర దుకాణాలు కిటకిటలాడాయి. కాగా గుర్రంపల్లిలో కొనసాగుతున్న గుర్రంపీర్‌ ఉర్సులో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పాల్గొన్నారు. అశ్వానికి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ గణేష్‌, జెడ్పీటీసీ స్వరూప, కొందుర్గు వైస్‌ఎంపీపీ రాజేష్‌ పటేల్‌, సర్పంచ్‌లు బాబూరావు, కిష్టమ్మ, నాయకులు హఫీజ్‌, జబ్బార్‌, అక్రం, మాణెయ్య, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:10 PM