Share News

కేవలం ఎన్నికలపైనే విపక్షాల దృష్టి : కొండా

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:43 PM

బీజేపీ దృష్టి ఎప్పుడూ దేశాభివృద్ధిపై ఉంటుందని, కానీ విపక్షాల ధ్యాస మాత్రం ఎప్పుడూ ఓట్లు సీట్లపై ఉంటుందని చేవెళ్ల మాజీ ఎంపీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

కేవలం ఎన్నికలపైనే విపక్షాల దృష్టి : కొండా
శంకర్‌పల్లిలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల, మార్చి 11 : బీజేపీ దృష్టి ఎప్పుడూ దేశాభివృద్ధిపై ఉంటుందని, కానీ విపక్షాల ధ్యాస మాత్రం ఎప్పుడూ ఓట్లు సీట్లపై ఉంటుందని చేవెళ్ల మాజీ ఎంపీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం శంకర్‌పల్లి మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజే పీలో చేరారు. వారితో ఆయన మాట్లాడుతూ కేవలం ఎన్నికల కోసం బీజేపీ పనిచేయదని, దేశాభివృద్ధే పార్టీ ల క్ష్యం అన్నారు. పేదల అభ్యన్నతికి పాటుపడేది బీజేపీ మాత్రమే అన్నారు. కానీ విపక్షాలు మాత్రం ఎన్నికల్లో ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ పేరు మార్మోగుతోందన్నారు. ఓ సర్వేలో అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ దేశా ధినేతలను తోసిరాజని అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీ గుర్తింపు పొందారన్నారు. బీఆర్‌ఎస్‌ పాలకులు రాష్ట్ర ధనాన్నంతా కాళేశ్వరంలో కుమ్మరించారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కార్యకర్తలంతా పనిచేయాలన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, మహిళామోర్చా అధ్యక్షరాలు గాయత్రి, విశ్వారెడ్డి, రాజకుమార్‌, రాజాచంద్ర, రాజేంద్రసింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 11:44 PM