Share News

ఇటుక బట్టీలో ఒడిశా కార్మికుడి హత్య

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:14 AM

ఇద్దరు కార్మికుల మధ్య జరిగిన గొడవ చినికి చినికి గాలి వానలా మారి ఒక హత్యకు దారితీసింది. దీనికి సబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటుక బట్టీలో ఒడిశా కార్మికుడి హత్య

మహేశ్వరం, జూన్‌ 10 : ఇద్దరు కార్మికుల మధ్య జరిగిన గొడవ చినికి చినికి గాలి వానలా మారి ఒక హత్యకు దారితీసింది. దీనికి సబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తుమ్మలూరులో గల ఓ ఇటుక బట్టీలో ఒడిశాకు చెందిన తులారాం(45), కెత్రోయాదవ్‌(32) కూలీలుగా పఇ చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరికి గొడవ జరిగి తులారాంను కెత్రోయాదవ్‌ ఇనుప ఆడ్డుతో కొట్టగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇటు కబట్టీ యజమాని మంగ్యానాయక్‌ సోమవారం పోలీసులకు సమాచా రం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని తులారాం మృతదేహాన్ని పోస్టుమార్టంకు, కెత్రోయాదవ్‌ను రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jun 11 , 2024 | 08:45 AM