సాధారణ ప్రసవాలు పెంచాలి : కలెక్టర్ శశాంక
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:12 AM
ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసరమైతేనే సిజేరియన్లు చేయాలని, నార్మల్ డెలివరీలను పెంచాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం, ఎంటీపీ, సరోగసీ చట్టాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
![సాధారణ ప్రసవాలు పెంచాలి : కలెక్టర్ శశాంక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసరమైతేనే సిజేరియన్లు చేయాలని, నార్మల్ డెలివరీలను పెంచాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం, ఎంటీపీ, సరోగసీ చట్టాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. సీ-సెక్షన్ ప్రసవాలను తగ్గించి ప్రజలకు మెరుగైన వైద్యమందించాలన్నారు. వైద్యులు సామాజిక దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. ఈ-బర్త్ పోర్టల్ను ఉపయోగించుకోవాలని తెలిపారు. చట్టబద్ధ గర్భస్రావాలు చేసేటప్పుడు నిర్దిష్ట ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ పద్మజ మాట్లాడుతూ సీ-సెక్షన్ డెలివరీ విధానంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా క్షయ నిర్మూలన అధికారి డాక్టర్ అరుణకుమారి. జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్య వైద్యులు, గైనకాలజిస్టులు పాల్గొన్నారు.