Share News

మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:41 PM

నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, లోక్‌సభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి ఏ. అనంత్‌రెడ్డి కోరారు.

మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం
దోమ:బొంపల్లిలో ఓటర్లతో మాట్లాడుతున్న డాక్టర్‌ మీరా

చేవెళ్ల, ఏప్రిల్‌ 19: నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, లోక్‌సభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి ఏ. అనంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోనే దేశం మరింత ముందుకు సాగుతుందన్నారు. బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మచ్చలేని నాయకుడని చెప్పారు. పార్టీలు మారుతూ అవినీతికి పాల్పడే నాయకులను ఓడించాలన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గ్రామ బూత్‌ కమిటీ అధ్యక్షుడు కొండా నాందేవ్‌గౌడ్‌, నాయకులు నాగర్జున్‌రెడ్డి, వైభవ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, జయసింహరెడ్డి, కుమార్‌గౌడ్‌, సారా కరణ్‌జీ, మాదవరావ్‌, సారా శివకుమార్‌జీ, బూషికే్‌షగౌడ్‌, దండు నర్సింలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ గెలవాలి

సరూర్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ గెలవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములుయాదవ్‌ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఓటర్లు ఆదరించి ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. కొండాకు మద్ధతుగా శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మీర్‌పేట్‌ శాఖ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ, కౌన్సిల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ కీసరి గోవర్దన్‌రెడ్డి, కార్పొరేటర్లు మద్ది సబితారాజశేఖర్‌రెడ్డి, కీసరి హరినాథ్‌రెడ్డి, పసునూరి భిక్షపతిచారి, పార్టీ ప్రధాన కార్యదర్శులు గాజుల మధు, కె.సోమేశ్వర్‌, నాయకులు సూల ప్రభాకర్‌, యాదగిరియాదవ్‌, నాగరాజు, బుచ్చిరాములు, నగేశ్‌, జేడీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

దోమ: బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని సోదరి డాక్టర్‌ మీరా శుక్రవారం బొంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరోసారి నరేంద్రమోదీ ప్రధాని కావాలంటే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పొరల అనంతయ్య, జిల్లా నాయకులు యాదయ్య, బొంపల్లి బూత్‌ అధ్యక్షుడు నర్సింహ, ఆంజనేయులు, రవీందర్‌, మల్లేశ్‌, హన్మంతు, మల్లయ్య, నర్సింహులు, మహేందర్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

మోమిన్‌పేట్‌: బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా బీజేపీ నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. మండలంలోని రామ్‌నాథ్‌గూడుపల్లి, దుర్గం చెరువు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కమలం పువ్వు గుర్తుపై ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్‌, బీజేవైఎం నాయకులు రాఘునాథ్‌రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, రాజిరెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, వెంకట్‌, నగేశ్‌ పాల్గొన్నారు.

విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యుల ప్రచారం

కులకచర్ల: బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలోని అనంతసాగర్‌లో శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్‌ కల్పనారెడ్డి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్య వెంకట్రామ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు మహిపాల్‌ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళితమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు హనుమంతు, పాశం నర్సింహారెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు భీమయ్య, మండల కోషాధికారిగా మహిపాల్‌, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:41 PM