దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మోదీ
ABN , Publish Date - Feb 02 , 2024 | 11:58 PM
దేశ ఖ్యాతి, ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని అన్మోల్ గార్డెన్లో బూత్స్థాయి నాయకులు, శక్తికేంద్ర ఇన్చార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు.
![దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మోదీ](https://media.andhrajyothy.com/media/2023/20231205/02_CVL_61_F_3dc13d4e48.gif)
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
షాబాద్, ఫిబ్రవరి 2 : దేశ ఖ్యాతి, ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని అన్మోల్ గార్డెన్లో బూత్స్థాయి నాయకులు, శక్తికేంద్ర ఇన్చార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 500 సంవత్సరాల చరిత్ర గల రామమందిరం సమస్యను చాకచక్యంగా పరిష్కరించి, గత నెల 22న 150 దేశాల్లో రామనామస్మరణను మారుమోగించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. గ్రామాల్లో బూత్ స్థాయి నుండి బీజేపీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ అఽభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ప్రతా్పరెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి, స్వచ్చభారత్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రాము, మండలాధ్యక్షుడు కిరణ్, నాయకులు రవీందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, మాణయ్య, నారాయణ, విష్ణువర్దన్రెడ్డి, గోపాల్, మహేందర్, సత్యం, మహేష్, హరీష్, జనార్దన్రెడ్డి, జైపాల్రెడ్డి, నరేందర్రెడ్డి, నర్సింహులు, రాఘవేందర్, శ్రీధర్, పవన్ పాల్గొన్నారు.