చిన్నారితో సహా మహిళ అదృశ్యం
ABN , Publish Date - Jun 02 , 2024 | 12:01 AM
మండలంలోని నల్లవారిపల్లికి చెందిన మేడల మమత(27) గత నెల 4న ఇద్దరు పిల్లలను వదలి తన వెంట ఒక పాపను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త మేడల దశరథం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![చిన్నారితో సహా మహిళ అదృశ్యం](https://media.andhrajyothy.com/media/2024/20240530/1_MDGL_2_a989640b7e.jpg)
మాడ్గుల, జూన్1: మండలంలోని నల్లవారిపల్లికి చెందిన మేడల మమత(27) గత నెల 4న ఇద్దరు పిల్లలను వదలి తన వెంట ఒక పాపను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త మేడల దశరథం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య గతంలోనూ ఒకసారి ఎవరికీ చెప్పకుండా వెళ్లి తిరిగి వచ్చిందని, అలాగే వస్తుందని ఎదురు చూసి రాకపోవడంతో ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. వెతికినా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. ఈ మేరకు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు.